20 ఏప్రిల్, 2009

మనసు కోసమే...

మల్లెలు...మరువము. మనువాడే మలిసంధ్య వేళ లో నీకోసం మౌన గీతం లా వేచి.. ఉంటే....రజని గంధాలు మోసుకొచ్చే చిరుగాలి నన్ను తాకి వెళ్ళినా .....మధు రవళుల మృదు సంగీతం ఏదో నను తట్టి పిలిచినా .ఈ మనసుకు నువ్వు వస్తేనే పరవసమో.....పరిమళమో....తెలిసేది...ఓ వెన్నెలా .....చల్లని తెల తెల్లని....నే మమతల పూలు వర్షిస్తేనే తెలిసేది ......నాలో మనసునదని.... ఈ గాలి...ఈ నీరు...ఈ ప్రకృతి....ఫై మమతల తడి పోలేదని....అందుకే వెన్నెలా వచ్చీ.ఫో... నన్ను నీ మృదు స్పర్స తో తడిపి వెళ్ళు.....నేను నువ్వు అయేంత గా....

1 కామెంట్‌: