20 ఏప్రిల్, 2009
మనసు కోసమే...
మల్లెలు...మరువము. మనువాడే మలిసంధ్య వేళ లో నీకోసం మౌన గీతం లా వేచి.. ఉంటే....రజని గంధాలు మోసుకొచ్చే చిరుగాలి నన్ను తాకి వెళ్ళినా .....మధు రవళుల మృదు సంగీతం ఏదో నను తట్టి పిలిచినా .ఈ మనసుకు నువ్వు వస్తేనే పరవసమో.....పరిమళమో....తెలిసేది...ఓ వెన్నెలా .....చల్లని తెల తెల్లని....నే మమతల పూలు వర్షిస్తేనే తెలిసేది ......నాలో మనసునదని.... ఈ గాలి...ఈ నీరు...ఈ ప్రకృతి....ఫై మమతల తడి పోలేదని....అందుకే వెన్నెలా వచ్చీ.ఫో... నన్ను నీ మృదు స్పర్స తో తడిపి వెళ్ళు.....నేను నువ్వు అయేంత గా....
లేబుళ్లు:
వెన్నెల కాలం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"నువ్వు వస్తేనే పరవసమో.....పరిమళమో....తెలిసేది."good one.
రిప్లయితొలగించండి