13 మే, 2009

బంగారు తల్లీ ..వేల అంజలులు ....

ఈ రోజు ఏదో చానల్ ప్రసారం చేసిన ఓ వార్తా కథనం ....మనసు లో తడి కన్నుల్లో గంగ గోదారులు గా మారింది .. వరంగల్ లో రైలు పట్టాల్ దాటే ఓ వృద్దుడిని రక్షించే ప్రయత్నంలో ఓ యువతి మరణం ...ఎంత గొప్ప మనసు ఆ పసితనం లో నే ...నిస్తేజం గా పడి వున్నా ...ఆ మానవత్వపు చాయలు ..మరణం గా మిగిలాయి.. అని బాదపడాలో ...ఇంకా మన మనస్సులో మమతల తడి ,పోలేదని ..మానవత్వపు పరిమళాలు ..వాడని గీతలో...శిల్ప లో ...జన్మించాలని ...కోరాలో తెలియని స్థితి ...ఎంతో కాలం గా తెల్సిన వాళ్ళకే ఓ చిన్న సాయం చేయాలంటే పది సార్లు ఆలోచించే మేము ...ఎవరో తెలీని వ్యక్తీ కోసం ప్రాణాలు ఇచ్చిన ...నీ ధైర్యానికి ,త్యాగానికి ఏమి ఇవ్వగలం ? బంగారు తల్లీ వేల అంజలు ...లు తప్ప ..